బేగంపేట్ : ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకునే విధంగ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం నెక్లెస్ రోడ్డులోని కర్భలా మైదానం ఘాట్ వద్ద బతుకమ్మ ఏర్పాట్లను ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
13న సద్దుల బతుకమ్మ సంధర్భంగా అంబేద్కర్నగర్, కర్భలామైదానం, పీవీ ఘాట్లలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తారని చెప్పారు. అందుకు అనుగుణంగ ఆయా ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. బతుకమ్మ సంధర్భంగా మహిళలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండ వాహనాలను దారి మళ్లించాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.
ఆదే విధంగా విద్యుత్ లైన్ల ఏర్పాటు, మంచినీటిని కూడా అందుబాటులో పెట్టాలని చేయాలని విద్యుత్ శాఖ, జలమండలి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం బతుకమ్మ పండగను అధికారికంగ నిర్వహిస్తున్న ట్టు గుర్తుచేశారు. మహిళలకు బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేసిన విషయాన్ని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ సీఈ బీఎల్ఎన్రెడ్డి సీఈ శంకర్, ఉత్తర మండలం కమిషనర్ శ్రీనివాస రెడ్డి , జలమండలి జీఎం రమణారెడ్డి, కార్పొరేటర్లు మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.