ఆర్కేపురం : ఆర్కేపురం డివిజన్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 7 నుంచి నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రోత్సవాల బ్రోచర్ను ఆదివారం మంత్రి సబితాఇంద్రారెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ జగిని రమేష్గుప్త మాట్లాడుతూ ఈ నెల 7 నుంచి 15వ తేది వరకు నిర్వహించే శరన్నవరాత్రోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
15న విజయదశిమి సందర్భంగా సాయంత్రం శమివృక్ష పూజ ఉంటుందని తెలిపారు. నవరాత్రోత్సవాలకు మంత్రి సబితాఇంద్రారెడ్డిని ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, ఖిల్లా మైసమ్మ ఆలయ చైర్మన్ గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, సాజీద్, ధర్మకర్తలు తాడేపల్లి వెంకటేశంగుప్త, బి.ప్రశాంత్, బి.రవీందర్రెడ్డి, పి.శ్రీనివాస్, ఎస్.మంజుల, బి.వెంకటరమణ తదితరులు ఉన్నారు.