కవాడిగూడ : భోలక్పూర్లో శాశ్వత డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం భోలక్పూర్ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్లో నియోజక వర్గ అభివృద్ది ఫండ్ కింద రూ. 3లక్షల నిధులతో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ మహ్మద్ గౌసొద్దీన్ తో కలిసి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణానగర్లో గత కొన్నేండ్ల నుంచి డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, దీంతో స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్థానికులు ఎదుర్కొంటు న్న సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా కాలనీలోని బస్తీలలో కలుషిత నీరు వస్తుందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే అక్కడ నెలకొన్న సమస్యను తీర్చాలని జలమండలి డీజీఎం వాహబ్ సాబ్ను ఎమ్మెల్యే ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, భోలక్పూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, కంటెస్టెడ్ కార్పొరేటర్ బింగి నవీన్కుమార్, శ్రీ భవాణీ శంకర్ దేవాలయం చైర్మన్ ఆర్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.