సైదాబాద్: మాతృశ్రీకాలనీలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించటానికి అధికారులు కృషి చేయాలని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల అన్నారు. బుధవారం సైదాబాద్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ కాలనీలో ఆయన జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా మంచినీటి, మురుగునీటి వ్యవస్థల సమస్యలు కాలనీవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, వాటి శాశ్వతంగా పరిష్కరించేందుకుగాను అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని జలమండలి అధికారులను అదేశించారు. మంచినీటి సరఫరాలో కలుగుతున్న సమస్యలను తొలగించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యుత్ సమస్యలను, వీధిదీపాల ఏర్పాటు, కొత్త రోడ్ల నిర్మాణాలపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆస్మాన్ఘడ్ సబ్ డివిజన్ జలమండి డీజీఎం షీలారాణి, మేనేజర్ శ్రావణ్, వర్క్ ఇన్స్పెక్టర్ మనోహార్, జీహెచ్ఎంసీ ఏఈ వెంకన్న, వర్క ఇన్స్పెక్టర్ రాజ్కుమార్, స్థానిక నాయకులు సుమంత్గౌడ్, అమర్, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.