చిక్కడపల్లి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకుల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి పెద్ద సంఖ్యలో చేరుతున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యానిర్వాహక కార్యాదర్శి పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో ఆదివారం ఆంధ్రకేఫ్ చౌరస్తాలో స్థానిక నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
స్థానిక బీజేపీ నాయకులు రమణ, కిషోర్, శ్రీకాంత్, రమేశ్, నాగేంద్ర, గణేశ్, వెంకటేశ్, మనోజ్ శ్రీను,అభిరామ్ తదితరులు ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, యువ నేత ముఠా జైసింహ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రల్లో అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాల అమలు, జరుగుతున్న అభివృద్ధి చూసి ఇతర పార్టీల కు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు.
డివిజన్ అధ్యక్షుడు ఎం.రాకేశ్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, మారిశెట్టి నర్సింగ్ రావు,ముఠా రామ్రాజ్, మారిశెట్టి నర్సింగ్ రావు, సత్యనారాయణ, వి.వెంకటేశ్, దేవయయ, హన్మంతు, ప్రేమ్, సంతోష్, కిరణ్ కుమార్, ఆనంద్, సంతోష్, యాసీన్, బోనం బన్నీ, ముఠా శివసింహ, కుమార స్వామి, మహిళా విభాగం అధ్యక్షురాలు వనజ, పద్మ సూర్య, ప్రకాశ్ సుధా, తదితరులు పాల్గొన్నారు.