అంబర్పేట : దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు దేవాలయాల్లో అమ్మవారిని శ్రీదుర్గాదేవిగా అలంకరించారు. అంబర్పేట మహంకాళి అమ్మవారు బుధవారం శ్రీదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారు జామునే అమ్మవారికి అభిషేకాలు, హోమాలు నిర్వహించారు.
అదే విధంగా నల్లకుంట శంకరమఠంలో దుర్గాష్టమిని పురస్కరించుకొని దుర్గాగా అలంకరించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తులు అధిక సఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.
బాగ్అంబర్పేట బతుకమ్మకుంటలోని శ్రీమైసమ్మ దేవాలయంలో కూడా అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా హోమం నిర్వహించారు. అన్నదానం గావించారు.