యాదాద్రి, డిసెంబర్ 30 : ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయంలో గురువారం స్వామి, అమ్మవార్లకు అర్చక బృందం, వేద పండితులు లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్య తిరుకల్యాణ మహోత్సవం జరిపించారు. కొండపై ఉన్న పర్వతవర్ధినీ రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన చేశారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. యా దాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి.
శ్రీవారి ఆదాయం(రూపాయల్లో)
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,26,050
రూ. 100 దర్శనం టిక్కెట్ 83,000
వేద ఆశీర్వచనం 4,800
నిత్యకైంకర్యాలు 2,601
క్యారీబ్యాగుల విక్రయం 5,500
వ్రత పూజలు 1,02,400
కళ్యాణకట్ట టిక్కెట్లు 19,200
ప్రసాద విక్రయం 6,06,300
వాహనపూజలు 16,800
టోల్గేట్ 1,080
అన్నదాన విరాళం 14,821
సువర్ణ పుష్పార్చన 1,06,000
యాదరుషి నిలయం 50,200
పాతగుట్ట నుంచి 33,080
గోపూజ 700
ఇతర విభాగాలు 31,434