హిమాయత్నగర్ : స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికీ ఆదర్శమని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీమంత్రి ఎల్.రమణ, మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోల్ ఆనంద భాస్కర్ అన్నారు. వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్, అఖిల భారత పద్మశాలీ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బాపూజీ106వ జయంతి సందర్భంగా సోమవారం సాయంత్రం నారాయణగూడలోని పద్మశాలీ భవన్లో జరిగింది.
ఈ సందర్భంగా కొం డాలక్ష్మణ్ బాపూజీ విగ్రహాం, చిత్ర పటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలోనూ కీలక పాత్ర వహించి, జీవితాంతం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత సాఫల్య పురస్కారాన్ని తెలంగాణ బీసీ కమీషన్ మాజీ ఛైర్మన్ బిఎస్ రాములు, ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకుడు జె.బి రాజులకు అందజేసి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బరెం కల మధుసూదన్, సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు కందగట్ల స్వామి, నాయకులు వనం దశ్యంతల, అవ్వార్ భాస్కర్, గుంటక రూప, గుండేటి శ్రీధర్, పుట్ట పాండురంగయ్య, కత్తుల సుదర్శన్ పాల్గొన్నారు.