మైలార్దేవ్పల్లి : రాష్ట్రంలోని ఆడపడుచులకు అన్నగా, అండగా, భరోసానిచ్చే నాయకుడు సీయం కేసీఆర్ అని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ అన్నారు.బుధవారం మైలార్దేవ్పల్లి డివిజన్ టీఎన్జీవోస్ కాలనీ మోడల్ మార్కెట్లో ఏర్పాటు చేసిన చీరల పంపిణీకి ఆయన విచ్చేసి అర్హులైన వారికి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ..పండుగా పర్వదినంలో ఆడపడుచుల కళ్లలో ఆనందం నింపాలన్నదే కేసీఆర్ లక్ష్యం అని పేర్కొన్నారు. నియోజకవర్గం మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి పండుగా కానుకగా చీరలను , బట్టలను పంపిణీ చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.రాష్ట్రంలో నిరు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టి ప్రేమ్దాస్గౌడ్,డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్గౌడ్,యూత్ అధ్యక్షుడు రాఘవేందర్ యాదవ్ ,సరికోండ వెంకటేష్,కాశిగారి యాదగిరి,సంకూరి జయప్రకాష్,యంజాల మహేష్రాజ్,పున్న యాదగిరి,యంజాల శేఖర్,ఎల్లప్ప ,నాని,గోవింద్రాజ్ తదితరులు పాల్గొన్నారు.