401యార్డులకు రూ.10.09 కోట్లు మంజూరు
రూ.8.83కోట్ల మేరకు ఖర్చు చేసిన అధికారులు
ఇప్పటికీ కొనసాగుతున్న నిర్మాణాలు
కొన్ని గ్రామాల్లో అసంపూర్తిగా పనులు
పలు యార్డుల వద్ద కానరాని బాత్రూములు
కొన్నిచోట్ల పూర్తయినా నిరుపయోగమే
ఖాళీ స్థలాల్లోకే యథాతథంగా చెత్త తరలింపు
వరంగల్ రూరల్, మార్చి 18(నమస్తేతెలంగాణ): పల్లెల్లో పరిశుభ్రతపై అధికారులు కొందరు అలసత్వం ప్రదర్శిస్తున్నా రు. ప్రధానంగా డంపింగ్యార్డుల పట్ల నిర్లక్ష్యం కనబరుస్తు న్నారు. కొన్ని గ్రామాల్లో వీటి నిర్మాణాన్ని ఇప్పటికీ పూర్తి చేయలేదు. మరికొన్ని గ్రామాల్లో పూర్తయినా వినియో గంలోకి తేవడం లేదు. దీంతో పంచాయతీ సిబ్బంది చెత్తను ప్రభుత్వ స్థలం ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడికే తరలిస్తున్నా రు. ఫలితంగా జనం ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 401 గ్రామపంచాయతీలు ఉంటే 401 డంపింగ్యార్డుల నిర్మా ణానికి రూ.10.09 కోట్లతో ప్రభుత్వం పాలనా పరమైన అనుమతులు ఇచ్చింది. ఏడాది గడిచినా డంపింగ్యార్డుల నిర్మాణం ఇప్పటికీ నూరుశాతం పూర్తి కాలేదు. జిల్లాలో పల్లె ప్రగతి పనులపై తాజాగా అధికారులు ప్రభుత్వానికి అందజేసి న ప్రోగ్రెస్ రిపోర్టు ప్రకారం 397 డంపింగ్యార్డుల నిర్మా ణం పూర్తయింది. శాయంపేట, చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబె ల్లి మండలాల్లో ఇంకా ఒక్కొక్కటి నిర్మించాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల ఈ నాలుగింటి నిర్మాణం పూర్తి కాలేదని నివేదికలో తెలిపారు. డంపింగ్యార్డుల నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.8.83 కోట్లు ఖర్చు చేశామని, మరో రూ.1.26 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని వెల్లడించారు. వెబ్ సైట్లో మాత్రం 207 డంపింగ్ యార్డుల నిర్మాణమే పూర్త యినట్లు తెలిపారు. నివేదికలో 397 డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తయినట్లు అధికారులు పేర్కొన్నా వీటిలో చాలా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రతి డంపింగ్ యార్డు వద్ద బాత్రూము నిర్మించాల్సి ఉండగా పలు గ్రామాల్లోని డంపింగ్ యార్డుల వద్ద బాత్రూము నిర్మాణ పనులు మొదలే కాలేదు. వివిధ గ్రామాల్లోని డంపింగ్ యార్డుల్లో కంపోస్టు పిట్స్, పొడి చెత్తను వేరు చేసి వస్తువులను నిల్వ చేసే కంపార్టుమెంట్లను తయారు చేయాల్సి ఉంది. మరికొన్ని డంపింగ్ యార్డుల్లో కంపోస్టు పిట్స్, కంపార్టుమెంట్లకు పేర్లు రాయలేదు. రేకులతో షెడ్డు, కంపోస్టు పిట్స్, కంపార్టుమెంట్లు నిర్మించి వదిలేశారు. ఇంకా కొన్ని గ్రామాల్లో కనీసం బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు.
నిరుపయోగంగా..
ఇక నిర్మాణం పూర్తయిన డంపింగ్ యార్డులను వినియో గంలోకి తేవడం లేదు. దీంతో పలు గ్రామాల్లో నిరుపయో గంగా ఉంటున్నాయి. నిర్మాణం పూర్తయిన డంపింగ్ యార్డు లను ఉపయోగంలోకి తేవాలని ప్రభుత్వం పదేపదే చెబుతు న్నా అధికారులు కొందరు ఆచరణలో పెట్టడం లేదు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఊరూరా పరిశు భ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. పంచాయతీ సిబ్బంది గ్రామంలో వీధులు ఊడ్చిన, ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను తరలించేందుకు పంచాయతీకో ట్రాక్టర్, టేలర్ లేదా ట్రాలీ ఆటోను సమకూర్చింది. వీటి ద్వారా చెత్తను పంచాయ తీ సిబ్బంది ఊళ్లో నుంచి డంపింగ్యార్డుకు తరలించాల్సి ఉంది. అనంతరం తడి, పొడి చెత్తను వేరు చేసి పొడి చెత్తను డంపింగ్యార్డులోని కంపార్టుమెంట్లలో వేయాల్సి ఉంది. పొడి చెత్తలోని ప్లాస్టిక్, గాజు బాటిల్స్, పేపర్, అట్టలు, మెట ల్, ఎలక్ట్రానిక్స్, చెప్పులు, బ్యాగులు, పనికిరాని బట్టలను వేరు చేసి సదరు కంపార్టుమెంట్లలో వేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక తడి చెత్తను ఎరువుల తయారీ కోసం డంపింగ్యార్డులోని కంపోస్టు పిట్స్లో వేయాల్సి ఉంది. అత్యధిక శాతం గ్రామ పంచాయతీల పరిధిలోని డంపింగ్ యార్డుల్లో ఇవేవీ జరుగడం లేదు. డంపింగ్యార్డులు నిర్మించి చేతులు దులుపుకున్నారు. దీంతో పంచాయతీ సి బ్బంది యథావిధిగా గ్రామం నుంచి చెత్తను వాహనం ద్వారా ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉన్న ప్రదేశానికి తరలిస్తున్నారు. దుర్వాసనతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. తాజా ప్రో గ్రెస్ రిపోర్టులో జిల్లాలో నిర్మాణం పూర్తయిన 397 డంపింగ్ యార్డుల్లో 344ను వినియోగిస్తున్నట్లు అధికారులు ప్రభు త్వానికి తెలిపారు. తక్కువ శాతం డంపింగ్యార్డులు మాత్ర మే వినియోగంలోకి వచ్చాయి. వీటిలో చెత్తను పోసి పొడి చెత్తలోని ప్లాస్టిక్, గాజు బాటిల్స్, పేపరు, అట్టలు, మెటల్, చెప్పులు, బ్యాగుల, పనికిరాని బట్టలను వేరు చేసి కంపార్టు మెంట్లలో వేస్తున్నారు. ఇక ఎరువు తయారీ కొన్ని గ్రామా ల్లోని డంపింగ్ యార్డుల్లోనే మొదలైంది. దీనిపైనా అధికా రులు సరిగా దృష్టి పెట్టడం లేదు.