గోల్నాక : అంబర్పేట నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. న్యూపటేల్నగర్కు చెందిన ఎ.సత్యనారాయణ, పటేల్నగర్కు చెందిన ఎం.సత్య నారాయణ, కొంద్రపోలుకు చెందిన నారాయణరాజు, గోల్నాకకు చెందిన ఎం.సునీత, న్యూదుర్గానగర్కు చెందిన బి.సాయి నాథ్, బర్కత్పురకు చెందిన టి.శ్రీనివాస్లకు గోల్నాకలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసా నిస్తున్నదన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే అంబర్పేట చెన్నారెడ్డినగర్కు చెందిన టి.సత్తయ్యకు రూ.2లక్షల విలువచేసే ఎల్వోసీ లేటర్ను కూడా అందజేశారు.