వనస్థలిపురం : సీఎం సహాయనిధి ఆపదలో ఆదుకునే ఆత్మబంధువని, దానిని సద్వినియోగం చేసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. వనస్థలిపురం ప్రశాంత్నగర్కు చెందిన హరికృష్ణ గుండె సమస్యతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్సకు ఆర్థిక సమస్యలు రావడంతో ఎమ్మెల్యేను సంప్రదించారు.
ఆయన సిఫారసుతో రూ.3లక్షలు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరయ్యాయి. ఆ చెక్కును ఎమ్మెల్యే శుక్రవారం అందజేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ బీఎన్రెడ్డినగర్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఉమా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.