అబిడ్స్ : జాంబాగ్ శంకర్బాగ్లోని తుల్జాభవాని దేవాలయంలో జరిగే దసరా బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీని ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఆలయ కమిటీ చైర్మన్ గొడుగు గోపియాదవ్ ఆలయ కమిటీ ప్రతినిధులతో హోంమంత్రిని ఆయన నివాసంలో కలిసి ఉత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానించినట్లు గోపియాదవ్ తెలిపారు.