హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): రాజీవ్గాంధీ ఎయిర్పోర్టులో ఇకపై దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణీకులు ప్రధాన టెర్మినల్ నుంచే రాకపోకలు సాగించనున్నారు. ఈనెల 28న మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ మేరకు ఎయిర్పోర్టు అధికారులు గురువారం అధికారిక ప్రకటనను జారీ చేశారు. ఇంతకుముందు నేషనల్, ఇంటర్నేషనల్ విమాన సర్వీసులకు వేర్వేరు టెర్మినల్స్ ఉన్నాయి. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఇంటర్నేషనల్ ప్రయాణీకుల కోసం గతంలో ఎయిర్పోర్టు కుడివైపున తాత్కాలికంగా టెర్మినల్ను ఏర్పాటు చేశారు. సందేహాల నివృత్తికై హెల్ప్ లైన్ నెం.040-66546370 ను సంప్రదించాలని సూచించారు.
వచ్చే ఏడాది విస్తరణ పనులు పూర్తి
విమానాశ్రయ విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది చివరినాటికల్లా పూర్తికానున్నట్లు జీఎమ్మార్ వర్గాలు వెల్లడించాయి.