మాదాపూర్: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లచే తీర్చిదిద్దిన వస్త్రాలు, ఆభరణాలు మాదాపూర్లోని హెచ్ఐసిసిలో హై లైఫ్ ఎగ్జిబిషన్ పేరిట కొలువుదీరాయి. రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో ప్రత్యేక డిజైన్లచే కూడిన వస్త్రాలు, ఆభరణాలు, గృహోపకరణ ఉత్పత్తులు ప్రదర్శనలో ఉన్నాయి. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా సినీ నటి రిచా పనాయ్, యశ్నా దరి, జెన్నీలు హాజరయ్యారు.
పలువరు ప్రముఖ మోడల్స్ నిర్వాహకుడు డోమినిక్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువత ఇష్టాలు, అభిరుచులను దృష్టిలో ఉంచుకొని నూతన డిజైన్లు కలిగిన ఉత్పత్తులను ప్రదర్శించారు. ఇందులో భాగంగా వివాహ, ఫ్యాషన్ వేర్, డిజైనర్ వేర్, యాక్ససరీస్, జ్యువెల్లరీ, కిడ్స్వేర్ ఉత్పత్తులను నగర వాసుల కొరకు అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో నటి రిచా పనాయ్ మోడల్స్తో కలిసి ప్రదర్శనను వీక్షించింది.