అంబర్పేట: సాధించాలనే పట్టుదల ముందు విధి సైతం తలవంచింది. కళ్లు లేకపోయినా పట్టుదలతో చదివి జేఈఈ మెయిన్స్లో 70వ ర్యాంకు సాధించి అందరి మన్ననలు అందుకుంటున్నాడు రిత్విక్రామ్. జేఈఈ మెయిన్స్లో దివ్యాంగుల ఓబీసీ కోటాలో ఆలిండియా 70వ ర్యాంకు, దివ్యాంగుల జనరల్ కోటాలో 223వ ర్యాంకు సాధించాడు అంబర్పేట తిరుమలనగర్కు చెందిన ఉప్పర రిత్విక్రామ్. కాగా దివ్యాంగుడైనప్పటికీ అద్భుతంగా రాణించిన రిత్విక్ ను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుక్రవారం శాలువాతో సన్మానించారు.
గోల్నాకలోని ఎమ్మెల్యేక్యాంపు కార్యాలయంలో రిత్విక్, అతని తల్లిదండ్రులను అభినందించారు. అంబర్పేటకు చెందిన విద్యార్థి రిత్విక్ జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంకు సాధించి సత్తా చాటడం నియోజకవర్గానికే గర్వకారణమన్నారు. అతనికి తనవంతు సహకారం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తల్లి నళిని, తండ్రి ఉపేంద్ర, సోదరుడు గగన్సాయిలు పాల్గొన్నారు.