సుల్తాన్బజార్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నేతృత్వంలో ఈ నెల 16 నుండి మేడా రం జాతరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజ నల్ మేనేజర్ బి వరప్రసా ద్ పేర్కొన్నారు.ఇప్పటికే సంక్రాంతి పండుగ నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు గాను 4318 ప్రత్యేక బస్సులను నడుపుతున్న విషయం విధితమే.
కాగా రెండేండ్ల కొకసారి ఎంతో వైభవంగా జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతరకు టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎంజీబీఎస్ నుండి మేడారంకు ప్రత్యేక బస్సులను నడు పుతున్నట్లు ఆయన వివరించారు. ఈ నెల 16న హైదరాబాద్ డిపో-1, డిపో-2.పికెట్లకు చెందిన మూడు సూపర్ లగ్జరీ బస్సులను ఉదయం 6,7,8 గంటలకు ఎంజీబీఎస్ నుండి మేడారంకు, సాయంత్రం 3,4,5 గంటలకు మేడారం నుండి ఎంజీబీఎస్ కు బస్సులు బయలు దేరుతాయని అన్నారు.
మేడారం జాతర కొనసాగే వరకు ప్రతి ఆదివారం మూడు బస్సులను హైదరాబాద్ డిపో-1 ఆధ్వర్యంలో మూడు సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రవీందర్ వివరించారు. పెద్ద వారికి 398 రూపాయలు, 11 ఏళ్ళ లోపు చిన్నారులకు 200 రూపాయల టిక్కెట్ ధర నిర్ణయించడ మైందన్నారు. మేడారం జాతరకు వెళ్ళే భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.