మెహిదీపట్నం : ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. శనివారం కార్వాన్ నియోజకవర్గం నానల్నగర్ డివిజన్ సాలార్జంగ్ కాలనీలో హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ పర్యటించారు.
ఈ సందర్భంగా సాలార్జంగ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అర్ఫా బట్టల దుకాణాన్ని హోంమంత్రి ప్రారంభించారు. నానల్నగర్ కార్పొరేటర్ ఎండీ.నసీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.