బన్సీలాల్పేట్ : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బన్సీలాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ కే.హేమలత సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ప్రోత్సాహించి, అవకాశం కల్పించిన మంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పూలబొకే అందించి, శాలువాతో ఆయనను సన్మానించారు.
అనంతరం హేమలతను ఆయన అభినందించారు. డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండాలని, నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలని మంత్రి అన్నారు. పార్టీ నాయకులు కె.లక్ష్మిపతి, ప్రేమ్కుమార్, శ్రీలక్ష్మి, అబ్బాస్, వెంకటేశ్, మురళి, వినయ్, రమేశ్లు పాల్గొన్నారు.