శంషాబాద్ రూరల్ :భారీ వర్షానికి మండలంలోని ఈసీవాగు, ఎంటేరు వాగులోకి వరదనీరు భారీగా వచ్చి చేరింది. వికారాబాద్ జిల్లా అనంతగిరి నుంచి ప్రారంభమయ్యే ఈసీవాగు పూడూరు, షాబాద్, శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాల మీదుగా హిమాయత్సాగర్ చెరువులోకి చేరుతుంది.
దీంతో పాటు సుల్తాన్పల్లి, కేబిదొడ్డి గ్రామాల శివారులో ఈసీ, ఎంటేరువాగు కలిసి చెరువులోకి చేరుతాయి. అయితే ఈసీ వాగుకు భారీగా వరద రావడంతో సుల్తాన్పల్లి – కేబిదొడ్డి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెండు గ్రామాల మధ్య ఎంటేరు వాగు బ్రిడ్జి పై నుంచి నీరు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి.