మణికొండ : దీపావళి పర్వదినం సందర్బంగా ప్రతిఏటా యాదవులు ఘనంగా నిర్వహించే సదర్ ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నార్సింగి మున్సిపాలిటీ ప్రధాన కేంద్రం నార్సింగిలో మంగళవారం సదర్ ఏర్పాట్లపై యాదవ సంఘాల ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
సదర్ ఉత్సావాల కోసం హర్యానా నుంచి లవ్ రాణా, శ్రఖ్ అనే రకాలైన గేదెలను ఇప్పటికే రప్పించారు. ఈ సందర్బంగా గ్రామంలో పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమాలను చేపడుతామని నిర్వాహకులు క్యాతం శ్రీకాంత్యాదవ్ తెలిపారు. అన్నివర్గాల ప్రజలు కలిసిమెలసి సదర్ ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు.