జూబ్లీహిల్స్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధుతో తెలంగాణలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయని, రైతుల ఖాతాల్లో రూ.50 వేల కోట్లు జమచేయడంతో ప్రతిరైతు ఇంటా సంక్రాంతి కాంతులు వెదజల్లు తున్నాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు.
శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాలలో భాగంగా కార్పొరేటర్లతో కలిసి ఆయా డివిజన్లలో పతంగులు పంపిణీ చేశారు. రహ్మత్నగర్ డివిజన్ కమలానగర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లపైన పతంగులు ఎగురవేసి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో ఇంత పెద్ద మొత్తం డబ్బులు వేసిన ముఖ్యమంత్రి ఉన్నారంటే అది కేవలం సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. ఆయా డివిజన్లలో నిర్వహించిన కార్యక్రమాలలో కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, సంగీతా యాదవ్, డివిజన్ల అధ్యక్షులు కోనేరు అజయ్, అప్పుఖాన్, సంజీవ, సంతోష్ ముదిరాజ్, ప్రదీప్, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.
బోరబండలో..
సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బోరబండ డివిజన్కు అందజేసిన పతంగులను కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్ పంపిణీ చేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
శుక్రవారం బోరబండ చౌరస్తా, హైటెక్ పాయింట్, వీకర్ సెక్షన్స్ తదితర ప్రాంతాలలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలలో పతంగులను పంపిణీ చేయడంతో పాటు పతంగులను ఎగురవేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.