పరిగి : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శుక్రవారం పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్రెడ్డి సతీమణి సీతారంజిత్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డిలు మొక్కలు నాటి నీరు పోశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ చేపట్టి పచ్చదనం పెంపునకు సహకరించాలన్నారు. ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ గొప్ప లక్ష్యంతో కూడుకున్నదని వారు అభిప్రాయపడ్డారు.