కాచిగూడ : పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. కాచిగూడ డివిజన్ ప్రాంతానికి చెందిన మహ్మాద్ జహింగీర్కు ఇటీవల గుండె అపరేషన్ జరిగింది.
కేంద్రమంత్రి కిషన్రెడ్డి చొరవతో జహింగీర్కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.1 లక్షా 50 వేల రూపాయల చెక్కును కేంద్ర మంత్రి, కాచిగూడ కార్పొరేటర్ ఉమాదేవి, నగర ఉపాధ్యక్షుడు కన్నె రమేశ్యాదవ్ గురువారం బర్కత్పురలో అందజేశారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వాటిని ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన వెల్లడించారు.