కందుకూరు : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మీర్ఖాన్పేట్ గ్రామానికి చెందిన వరికుప్పల లక్ష్మమ్మ అనారోగ్యానికి గురై ఆసుపత్రి ఖర్చుల కోసం సీఎం రీలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకుంది.
విచారణ జరిపిన అధికారులు ఆమెకు 44వేల రూపాయలను మంజూరు చేశారు. అట్టి చెక్కును శుక్రవారం రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలను సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని చెప్పారు. సీఎం రీలీఫ్ ఫండ్ పేదలకు వరంలాంటిదన్నారు.
ప్రభుత్వ పేదల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని తెలిపారు. పేదల కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో ఎంపీటీసీ కాకి రాములు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్రహ్మణపల్లి చంద్రశేఖర్గుప్తా, బాధిత కుంటుంబ సభ్యులు పాల్గొన్నారు.