మక్తల్ టౌన్, జనవరి 2: పేద విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉన్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలోని ఆనంద నిలయం విద్యార్థులకు బట్టలు, క్రీడాసామగ్రిని ఎమ్మెల్యే చిట్టెం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పేద విద్యార్థులకు ఇంగ్లిష్ విద్యను అందించేందుకు గురుకులాలకు ప్రవేశపెట్టి మెరుగైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు ఇతర కులాలకు చెందిన పేదవిద్యార్థులు ఆనందనిలయం లో ఉంటూ చదువుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, శేఖర్రెడ్డి, రామలింగం, వార్డెన్, విద్యార్థులు పాల్గొన్నారు.