కందుకూరు : గొల్ల, కుర్మల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మండల కుర్మ సంఘం నాయకులు మంత్రిని కలిసి సన్మానించారు. అనంతరం ఆత్మ గౌరవ భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గొల్ల కుర్మలను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అన్ని రంగాల్లో రాణించాలని వారిని కోరారు. సీఎం కేసీఆర్ గొల్ల కుర్మలు ఆర్థికంగా ఎద గ డానికి కృషి చేస్తున్నారని చెప్పారు. అందుకోసం ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.
కార్యక్రమంలో ఆకులమైలారం, గుమ్మడవెల్లి గ్రామాల సర్పంచ్ లు గొరిగే కళమ్మ రాజు, గౌర,ప్రభాకర్ , టీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్ , సీనియర్ నాయకులు సురుసాని సురేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్ , కురుమ సఘం నాయకులు ఎగ్గిడి సత్తయ్య, టైరు పాండు, అచ్చన పాండు, గౌర జంగయ్య, ఆంజనేయులు, పర్వతాలు పాల్గొన్నారు.