సికింద్రాబాద్ : నిరు పేదలకు ఖరీదైన వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుంద ని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. రసూల్పురా పోలీస్ లైన్కు చెందిన శంకరమ్మ కిడ్నీల సమస్యతో గత కొద్దిరోజుల క్రితం నిమ్స్ అసుపత్రిలో చేరగా, శస్త్ర చికిత్స చేయాలని సుమారు రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు పేర్కొన్నారు.
దీంతో ఎమ్మెల్యే సాయన్న దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ఆయన సీఎంఆర్ఎఫ్ కింద దరఖాస్తు చేయించారు. ఈ నేపథ్యంలో సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.5లక్షల ఎల్వోసీ మంజూరు అయింది. ఈ క్రమంలో మంజూరైన ఎల్వోసీని మంగళ వారం రసూల్పురాలో నివాసముంటున్న శంకరమ్మ ఇంటికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న వెళ్లి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ తెలంగాణలో సబ్బండ వర్ణాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని కొనియడారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లాస్యనందితా, టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి గోపాల్, దన్రాజ్, సదానంద్గౌడ్తో పాటు స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.