బంజారాహిల్స్ : తన ఇంటిముందు జీహెచ్ఎంసీకి చెందిన ఫుట్పాత్ను కబ్జాచేసి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నిర్మించిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ సిబ్బంది మంగళవారం కూల్చేశారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెం 88లో ఎంపీ సీఎం రమేష్ ఇంటికి ముందు ఉన్న ఫుట్పాత్ను అక్రమించి సుమారు 50గజాలకు పైగా స్థలాన్ని ఆక్రమించడంతో పాటు రెండంతస్థుల భవనాన్ని నిర్మించారు. ఈ విషయంపై స్థానికులు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో ఈ నెల 6న టౌన్ప్లానింగ్ సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు.
ఆ సమయంలో సీఎం రమేష్ కుటుంబ సభ్యులతో పాటు కార్యాలయ సిబ్బంది జీహెచ్ఎంసీ సిబ్బందిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పాటు తామే అక్రమణలను తొలగిస్తామని చెప్పడంతో పాక్షికంగా కూల్చివేతలు చేపట్టారు.
అయితే చెప్పిన విధంగా ఆక్రమణలను తొలగించకపోగా మరోసారి భవనాన్ని నిర్మించడంతో సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ సిబ్బంది మంగళవారం అక్కడకు చేరుకుని కూల్చివేతలు చేపట్టారు. భారీ ఎత్తున నిర్మించిన భవనాన్ని నేలమట్టం చేశారు.