మాదాపూర్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని జెమ్ మోటార్ అధినేత రాజు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళనాన్ని శుక్రవారం రాత్రి మాదాపూర్లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చెవెళ్ళ ఎంపీ రంజిత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయిబాబాలతో కలిసి ఈ ఉత్పవాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా దున్నపోతును వాడవాడలా డప్పుదరువుల మధ్య ఊరేగించారు.
యాదవ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని సదర్ ఉత్సవాలను ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎరగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శ్రవణ్ యాదవ్, రాంబాబు, అనిరుద్ యాదవ్, రమేష్ వేణుగోపాల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.