చిక్కడపల్లి : మత సామరస్యానికి ప్రతీక గ్యార్వీ ఉత్సవాలు అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లి రాజీవ్గాంధీనగర్ బస్తీలో బస్తీ అధ్యక్షుడు మహ్మద్ సాబేర్ ఆధ్వర్యంలో గ్యార్వీ ఉత్సవాలు నిర్వహించారు.
కార్యక్రమంలో యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు ఆర్.మోజస్,ఆర్. వివేక్, సిరిగిరి కిరణ్ కుమార్. జనార్దన్, ఎరం శేఖర్, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.