సైదాబాద్ : ఆస్మాన్ఘడ్ రిజర్వాయర్ వద్ద మంచినీటి పైప్లైన్ల నిర్వహణలో ఏర్పాడ్డ ఇబ్బందులను తొలగించటానికి జలమండలి ఆస్మాన్ఘడ్ సబ్ డివిజన్ పరిధిలోని సైదాబాద్, అక్బర్బాగ్ డివిజన్ల పరిధిలోని అన్ని ప్రాంతాలకు శనివారం మంచినీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆస్మాన్ఘడ్ జలమండలి డీజీఎం షీలారాణీ ఒక ప్రకటనలో తెలిపారు. అక్బర్బాగ్, సైదాబాద్ డివిజన్ల ప్రాంతాలకు సరఫరా అయ్యే మైయిన్ పైప్లైన్ల వాల్వల మరమతుల కారణంగా మంచినీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆమె తెలిపారు. సోమవారం యధావిధిగా అన్ని ప్రాంతాలకు మంచినీటి సరఫరా కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.