శంషాబాద్ రూరల్ : వేరువేరు చోట్ల మంటలు చెలరేగడంతో గడ్డివాము, చెట్లు దగ్ధమైన సంఘటన ఆదివారం శంషాబాద్లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మల్కారం గ్రామానికి చెందిన రైతు శ్రీరాములు కు చెందిన గడ్డివాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో భారీ ఎత్తున మంటలు అంటుకొని దాదాపు 40వేల విలువ చేసే గడ్డి దగ్ధమైనట్లు బాధిత రైతు తెలిపారు.
దీంతో పాటు మండలంలోని ఘాన్సిమియాగూడ గ్రామ పరిధిలో జాతీయ రహదారికి అనుకొని ఉన్న ప్రభుత్వ పాఠశాల దగ్గర ఉన్న ఓ వెంచర్లో సాయంత్రం మంటలు చెలరేగడంతో వెంచర్లోని గడ్డితో పాటు చెట్లు అంటుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు.