మియాపూర్ : వాణిజ్య కార్యకలాపాల ద్వారా పోగయ్యే చెత్తను నిర్లక్ష్యంగా రహదారి పక్కన తగులబెట్టడంతో పాటు , ప్రజల అసౌకర్యానికి కారణమైన ఓ మొబైల్ ఫుడ్ కోర్టు నిర్వహకుడికి చందానగర్ పారిశుద్ధ్య విభాగం అధికారులు గురువారం రూ. 10 వేల ఫైన్ను విధించారు.
మంజీరా పైప్లైన్ రోడ్డులో ఈ మేరకు ఫుడ్ కోర్టు నిర్వహకుడికి రశీదును సిబ్బంది అందించారు. మరో ప్రాంతంలోనూ పాత న్యూస్ పేపర్లు విక్రయదారుడు సైతం వాటిని రహదారి పక్కన తగులబెట్టగా…అతడికీ రూ. 2 వేల ఫైన్ను విధించినట్లు సర్కిల్ వైద్యాధికారి డాక్టర్ కార్తీక్ పేర్కొన్నారు.
పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.