నారాయణపేట, జనవరి 7 : ప్రజలు ఇంటి నుంచి బ యటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా మాస్కు ధరించాలని, లేని పక్షంలో జరిమానా విధిస్తామని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్ బీ సీఐ రాంలాల్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్యతో కలిసి శుక్రవారం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మా స్కులు పెట్టుకోని 305 మందిపై కేసులు నమోదు చేసి రూ. 3,05,000 జరిమానా విధించినట్లు చెప్పా రు. ఒమిక్రాన్ వేరియంట్పై ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బ హిరంగ సమావేశాలు, ర్యాలీలు, మత, రా జకీయ, సాంస్కృతిక, సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధించినట్లు వివరించారు. థర్డ్ వేవ్ ప్రభావాన్ని తగ్గించే ఉద్దేశంతో ప్ర భుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు స హకరించాలన్నారు. ప్రజలు తమవంతు సా మాజిక బాధ్యతగా ప్రభుత్వ ఆదేశాలను పా టించాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.