బేగంపేట్: ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగ వ్యాక్సిన్ వేయించుకోవాలని సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి సూచించారు. యాక్షన్ ఎయిడ్ సంస్థ రూపొందించిన కొవిడ్పై అవగాహన ప్రచార యాత్ర పోస్టర్ను గురువారం సికింద్రాబాద్ ఆర్డీవో తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ…కరోనా పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
కరోనా జాగ్రత్తలపై యాక్షన్ ఎయిడ్ సంస్థ చేపడుతున్న ప్రచార కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పులి కల్పన, డిప్యూటీ తహసిల్ధార్లు తదితరులు పాల్గొన్నారు. ఈక్రమంలో గురువారం సికింద్రాబాద్లోని రాణిగంజ్, మినిష్టర్రోడ్డు ప్రాంతాలలో ప్రచారం కొనసాగించారు.