మహబూబ్నగర్ రూరల్, జనవరి 9 : రైతుబంధు ఊరూరా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ మండలం కోడూర్లో ఆదివారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఉత్సవాలకు గ్రం థాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్ హాజరై మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో రైతులు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సోమవారం కోడూర్ చౌరస్తా, కోటకదిర రైతువేదికలో నిర్వహించనున్న సం బురాలకు మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరుకానున్నట్లు తెలిపారు. అదేవిధంగా కోటకదిరలో సర్పంచ్ రమ్య ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించా రు. కార్యక్రమాల్లో ఎంపీపీ సుధాశ్రీ, సర్పంచ్ శ్రీకాంత్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, రైతుబంధు సమితి మండల అ ధ్యక్షుడు దేవేందర్రెడ్డి, రవీందర్రెడ్డి, రాఘవేందర్గౌడ్, పాండురంగారెడ్డి, బుచ్చిబాబుగౌడ్, మన్యంకొండ దేవస్థానం పాలకమండలి సభ్యుడు చిన్నయ్యగౌడ్, సింగిల్విండో డైరెక్టర్ కృష్ణయ్యగౌడ్, రైతుబంధు సమితి గ్రామాధ్యక్షుడు నర్సయ్యగౌడ్, ఏఈవోలు నాగార్జున, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి పెద్దపీట
మహబూబ్నగర్, జనవరి 9 : రైతు సం క్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నదని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. జిల్లాకేంద్రం సమీపంలోని దివిటిపల్లి రైతువేదికలో రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. దివిటిపల్లి క్లస్టర్ పరిధిలో నిర్వహించిన ఉపన్యాస, క్విజ్ పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే ఉత్తమ రైతులను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కా ర్యక్రమంలో డీసీసీబీ ఉపాధ్యక్షు డు కొరమోని వెంకటయ్య, రైతుబంధు సమితి జి ల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, దివిటిపల్లి సర్పంచ్ జరీనాబేగం, కొమ్మురి అనిత, కౌ న్సిలర్ యాదమ్మ, గోనెల రాములు, శ్రీనాథ్శర్మ, సుధానర్సింహులు, చెన్నయ్య, హన్మంతు, చెన్నారెడ్డి, శేఖర్, ఆంజనేయు లు, రాములు, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
భూత్పూర్ మున్సిపాలిటీలో..
భూత్పూర్, జనవరి 9 : మున్సిపాలిటీలోని 3వ వార్డు గోప్లాపూర్ సమీపంలోని వ్యవసాయ పొలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతుబంధు పథకం ద్వారా పంటసాగు పెట్టుబడికి ప్రభుత్వం రూ.50వేలకోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడంపై అన్నదాతలు హ ర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, రామకృష్ణ, కోఆప్షన్ సభ్యుడు అజీజ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్గౌడ్, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, స త్యనారాయణ, సాయిలు,గౌరయ్య, రాములు, నర్సింహారెడ్డి, రాంరెడ్డి, యాదయ్య పాల్గొన్నారు. అదేవిధంగా మ ద్దిగట్లలో సర్పంచ్ కదిరె ప్రియాంకారెడ్డి ఆ ధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సింగిల్విం డో చైర్మన్ అశోక్రెడ్డి పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, జనవరి 9 : రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ రూరల్ మండలం గాజులపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశా రు. కార్యక్రమంలో సర్పంచ్ భాస్కర్, ఎంపీటీసీ బంగారు వెంకటయ్య, టీఆర్ఎస్ గామాధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాయకులు రాజు, సురేశ్, మాధవరెడ్డి, రాజన్న, యాద య్య తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, జనవరి 9 : మండలంలోని పలు గ్రామాల్లో రైతుబంధు సం బురాలను ఘనంగా జరుపుకొన్నారు. దేవరకద్ర క్లస్టర్ ఇన్చార్జి, టీఆర్ఎస్ మండల అ ధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో గ్రా మశివారులోని రైతు ముకుందారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సంబురాలు నిర్వహించా రు. అలాగే చౌదర్పల్లిలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొండా సుగుణాశ్రీనివాస్రెడ్డి ఆ ధ్వర్యంలో నిర్వహించిన సంబురాల్లో రైతు లు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమా ల్లో ఎంపీపీ రమాదేవి, రైతుబందు సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి, సర్పంచు లు యుగందర్రెడ్డి, బుచ్చారెడ్డి, నాయకు లు శ్రీకాంత్యాదవ్, కొండా శ్రీనివాస్రెడ్డి, భాస్కర్, ధర్మేందర్, ఏవో రాజేందర్ అగర్వాల్, ఏఈవోలు శివకృష్ణ, మౌనిక, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, జనవరి 9 : రైతుబంధు వా రోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మహిళలకు ము గ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కమ్మదనం గోపాల్రెడ్డి పాల్గొన్నారు.