మెండోరా, జనవరి 7 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పనులకు సంబంధించిన ఎస్టిమేషన్ను పంపాలని, ఆనకట్టపై గేజ్ రూం నిర్మించాలని కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) అధికారులు నాగేందర్రావు, ఎన్. వెంకటేశ్వర్లు, శంకర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలోని నీటిపారుదల శాఖ అతిథి భవనంలో ఇంజినీరింగ్ అధికారులతో వారు శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రాజెక్ట్ అభివృద్ధి పనులను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద, ప్రాజెక్టు అభివృద్ధి పనులపై సమీక్షించారని ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. అనంతరం వరద గేట్లకు చేపడుతున్న పనులను వారు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆనకట్టపై గేజ్రూమ్, మహిళా అధికారులకు ప్రత్యేక గదిని నిర్మించాలని ఎస్సారెస్పీ అధికారులకు సూచించారు. వారి వెంట చీఫ్ ఇంజినీర్లు శ్రీనివాస్రెడ్డి, అజయ్కుమార్, మధుసూదన్, సంజీవ్, ఈఈ చక్రపాణి, డీఈ ఏఈఈలు ఉన్నారు.