నాగర్కర్నూల్, జనవరి 8 : రాష్ట్రంలో సత్వర న్యా యం, ప్రతి ఒక్కరికీ సమ న్యాయం అందించేందుకు కోర్టుల్లో మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని రాష్ట్ర హైకోర్టు పరిపాలనా న్యాయమూర్తి శ్రీదేవి స్పష్టం చేశారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ. 4.95 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెండు కోర్టు భవనాలను హైకోర్టు న్యాయమూర్తులు వెంకటేశ్వర్రెడ్డి, మాధవీదేవి, మహబూబ్నగర్ ప్రిన్సిపల్ సె షన్ కోర్టు జడ్జి ప్రేమావతి, కలెక్టర్ ఉదయ్కుమార్తో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం జడ్జి ప్రేమావ తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు పరిపాలనా న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడారు. నాగర్కర్నూల్ జిల్లాలో చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఒక శాశ్వత కోర్టు సముదాయం అందుబాటులోకి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే నాగర్కర్నూల్కు జిల్లా కోర్టు మంజూరు కావాలని, విశాలమైన స్థలంలో అన్ని మౌలిక సదుపాయాలతో కోర్టు సముదా యం ఏర్పడాలన్నారు. ఈ సముదాయాన్ని ప్రారంభిం చే కార్యక్రమానికి తానూ హాజరవ్వాలని కోరారు. తా ము ప్రాక్టీస్ చేసే రోజుల్లో సరైన సదుపాయాలు ఉండేవి కావని, రోడ్డు సైతం సరిగ్గా లేక కోర్టుకు సకాలంలో చేరుకునేవారం కాదని గుర్తు చేశారు. ఆర్టికల్ 39(ఏ) ప్ర కారం ప్రతి ఒక్కరికీ ధనిక, పేద అన్న తారతమ్యం లే కుండా సమాన న్యాయం పొందే హక్కు ఉన్నదన్నారు. దానిని నెరవేర్చడానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలని కోరారు. అంతకుముందు పోలీసులు గౌరవ వందనం స్వీకరించిన న్యాయమూర్తులకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అ నంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కోర్టు ఏర్పాటుకు కృషి చేసిన బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
న్యాయ వ్యవస్థను కాపాడాలి : హైకోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వర్రెడ్డి
నాగర్కర్నూల్ కోర్టు భవనానికి 2012లో రూ. 3.95 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూరు కాగా 2017లో భూమిపూజ చేయ గా.. నేడు ప్రారంభానికి నోచుకున్నదని హైకోర్టు న్యా యమూర్తి వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే భౌతిక, వ్యక్తిగత, డిజిటల్, మౌలిక సదుపాయాలు కలిగి ఉండడం ముఖ్యమన్నారు. జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనకు బార్ అసోసియేషన్ సభ్యులు కృషి చేయాలని, ఈ సమస్యలను హైకోర్టు దృష్టికి తీసుకురావాలని కోరారు. యువ న్యాయవాదులు తమకు కేసులు రావడం లేదని బాధపడొద్దని, పుస్తకాలు చదివి జ్ఞానం పెంచుకోవాలన్నారు. న్యాయవ్యవస్థను కాపాడి మంచి గుర్తింపు తీసుకురావాలని న్యాయవాదులను కోరారు. హైకోర్టు మరో న్యాయమూర్తి మాధవిదేవి మాట్లాడుతూ న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజలు కలిస్తేనే న్యాయ వ్యవస్థ అవుతుందన్నారు. న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 1992 సం వత్సరంలో తాను మొదటగా ఇక్కడే న్యాయవాద వృత్తి మొదలు పెట్టినట్లు చెప్పారు. నేడు న్యాయమూర్తిగా కో ర్టు భవన ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉ న్నదన్నారు. మహబూబ్నగర్ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ప్రేమావతి మాట్లాడుతూ నాగర్కర్నూల్ జిల్లాలో కోర్టు సముదాయం కోసం స్థలం కోరగా 15 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. అన్ని వసతులతో విశాలంగా స ముదాయాన్ని నిర్మించేందుకు హైకోర్టు తరుపున, జిల్లా యంత్రాంగం తరుపున సహాయ సహకారాలు అందించాలని కోరారు. కలెక్టర్ ఉదయ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో కేటాయించిన 15 ఎకరాల్లో నూతన కోర్టు భ వన సముదాయం ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. రెండు కోర్టులకు భవనాలు అందుబాటులోకి రావడంపై శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం న్యాయమూర్తులను శాలువాలు, మెమోంటోల తో సన్మానించారు. అనంతరం రాష్ట్ర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంత నర్సింహారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్రా వు, రాష్ట్ర అడ్వకేట్ల అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్బా బు, ఎస్పీ మనోహర్, బార్ అసోసియేషన్ సభ్యులు హ న్మంత్రెడ్డి, భుజంగరావు, గిరిధర్రావు మాట్లాడారు. కార్యక్రమంలో రిటైర్డ్ న్యాయమూర్తి మోహన్రావు, బార్ అసోసియేషన్ జిల్లా సభ్యులు, న్యాయవాదులు తదితరులు ఉన్నారు.