ఉట్నూర్, డిసెంబర్28 : ఉట్నూర్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్లిపట్టి, ఇప్పపువ్వు లడ్డూలు బాగున్నాయని, ఈ పరిశ్రమలతో గిరిజనులకు మెరుగైన ఉపాధి లభిస్తున్నదని భద్రాచలం మహిళలు పేర్కొన్నారు. ఉట్నూర్లోని పల్లిపట్టి, ఇప్పపువ్వు డ్డూల తయారీ పరిశ్రమలను మంగళవారం వారు సందర్శించారు. తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భగా జీసీసీ సేల్స్మెన్ శ్రీనివాస్, ఫారెస్ట్ కాలేజ్ రిసోర్స్ ఇనిస్టిట్యూట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ నవీన్ మాట్లాడారు. జీసీసీ, ఫారెస్ట్ కాలేజ్ రిసోర్స్ ఆధ్వర్యంలో భద్రాచలంలోని గుండాల మండలానికి చెందిన 40 మంది గిరిజన మహిళా గ్రూప్ సభ్యులను ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్లిపట్టి, ఇప్పపువ్వు లడ్డూల పరిశ్రమలను పరిశీలించేందుకు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి లభించిందని పేర్కొన్నారు. భద్రాచలంలోనూ ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంతో ఛత్తీస్గఢ్లో చింతపండుతో రసం తయారీ, కుట్టు మిషన్తో ఉపాధి తదితర పరిశ్రమలను సందర్శించినట్లు తెలిపారు. ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో పలు పరిశ్రమల ద్వారా చాలా మంది గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన మహిళలు కళావ తి, రజిత, ప్రభావతి, మాణిక్యం, ఉట్నూర్ పరిశ్రమల సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.