బేగంపేట్ : అన్ని సమస్యలను పరిష్కరించి రోజాతుల్ అష్పియా కబరస్తాన్ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్అన్నారు. గురువారం రాంగోపాల్పేట్ డివిజన్ కర్భలామైదాన్ గ్రేవీ యార్డ్ ను వివిధ శాఖల అధికారులతో కలిసి సందర్శించారు.
ఈ క్రమంలో గ్రేవీ యార్డ్ ఒక రేకుల షెడ్డు నిర్మించి సిమెంట్ ఫ్లోరింగ్ చేపట్టాలని, ప్రస్తుతం ఉన్న భవనం గది నిర్మాణం చేపట్టాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అదే విదంగా ఖబరస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో 10 హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయాలని చెట్లు, కొమ్మలు తొలగించాలని కోరారు. ఓ బోర్వెల్, నల్లా కనెక్షన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ కమిషనర్ ముకుందరెడ్డి, జలమండలి జీఎం రమణారెడ్డి, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, ఖబరస్తాన్ కమిటి అధ్యక్షుడు నూరల్, ప్రతినిధులు సాదిక్, నల్లగుట్ట మసీదు కమిటీ అధ్యక్షుడు దావూద్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.