ఘట్కేసర్ రూరల్, ఆగస్టు: రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన అన్ని కుల వృత్తులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటున్నట్లు ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. మండల పరిధి అంకుషాపూర్లో స్థానిక సర్పంచ్ కొమ్మిడి జలజ సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన నట్టల నివారణకు మందు వేసే కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి పాల్గొని గొర్రెల నట్టల నివారణ మందులను వేశారు.
గొల్ల, కుర్మలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం సత్పలితాలు ఇచ్చినట్లు చెప్పారు. మూగ జీవుల సంరక్షణకు ప్రతి ఒక్కరు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. గొర్రెలు, మేకలు రోగాల బారిన పడుకుండా ఎప్పటికప్పుడు పశువైద్యులను సంప్రదించి మందులు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ కొంతం అంజిరెడ్డి, పశువైద్యాధికారి డాక్టర్ పద్మిని, నాయకులు బుచ్చిరెడ్డి, కుమార్, మల్లేష్, రాజు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.