నారాయణపేట, డిసెంబర్ 20 : తెలంగాణ రైతుపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ సోమవారం టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నారాయణపేట జిల్లా కేంద్రంలోని సుభాష్రోడ్డు నుంచి సత్యనారాయణ చౌరస్తా వరకు కేంద్ర కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో సాగు విస్తీ ర్ణం పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతుకు భరోసాగా నిలిచారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యతను మరిచి యాసంగిలో ధాన్యం కొనమని చెప్పడం సిగ్గుచేటన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన ఉద్యమంలో 700మంది ప్రాణాలను పొట్టన పెట్టుకు న్న చరిత్ర బీజేపీకే దక్కిందన్నారు. వ్యవసాయ పొలాల వద్ద మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ కన్నజగదీశ్, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు విజయ్సాగర్, ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సుభాష్, కౌన్సిలర్లు గురులింగం, గందె చం ద్రకాంత్, ప్రతాప్రెడ్డి, గట్టురఘు పాల్గొన్నారు.