మైలార్దేవ్పల్లి : దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు.ఆదివారం మైలార్దేవ్పల్లి డివిజన్ మధుబన్ కాలనీ కనకదుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మండప పూజలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ..కాలనీ ప్రజలందరు సుఖఃసంతోషాలతో ఉండాలని యువత దేవి శరన్నావరాత్రులను భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటూ పూజలు నిర్వహించడం గొప్ప విషయం అని అన్నారు.
కాలనీ వాసులు దేవినవరాత్రును కలిసిమెలసి నిర్వహించుకొంటూ కాలనీ అభివృద్ధికి సహకరించాలని కాలనీ ప్రజలను కోరారు. అన్ని పండుగలు మతసామరస్యాన్ని పెంపోందించే విధంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్ , డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రేమ్గౌడ్, సరికొండ వెంకటేష్ , అక్కెం రాఘవేందర్ యాదవ్, కాశిగారి యాదగిరి, వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు.