మణికొండ : ప్రజాసమస్యల పరిష్కారానికి శక్తివంచనలేకుండా పాటుపడుతున్నామని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. గురువారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ది పనులకు శంఖుస్థాపన కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
రూ.5.30కోట్ల మున్సిపాలిటీ సాధారణ నిధులతో వివిధ కాలనీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రూ.42లక్షలతో సాయిప్రీతి రెసిడెన్సీ రోడ్డు నెంబర్ 25 అల్కాపూర్కాలనీలో సీసీ రోడ్డు పనులను, రూ.కోటీ 61లక్షలతో పందెన్వాగు నాలా స్ట్రాంగ్ వాటర్ డ్రైయిన్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు.
అదేవిధంగా రూ.కోటితో సెక్రటేరియట్ కాలనీలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు, రూ.50లక్షలతో పాషాకాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం, మరో రూ.50లక్షలతో పంచవటికాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. రూ.50లక్షలతో అంజలిగార్డెన్స్లో సీసీ రోడ్డు పనులు, ఫ్రెండ్స్కాలనీలో ఓపెన్ జిమ్ను ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్నివర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. శివారు మున్సిపాలిటీలపై సర్కారు ప్రత్యేక చొరవచూపుతోందని ఇప్పటికే కోట్లాది నిధులను మంజూరుచేసి అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు.
మణికొండ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేయాలని కోరారు. స్థానిక కాలనీలు, స్వచ్చంధ సంస్థలు అభివృద్ది కార్యక్రమాలకు సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్, వైస్ చైర్మన్ కె.నరేందర్రెడ్డి, కమీషనర్ ఫల్గుణ్కుమార్, కౌన్సిలర్లు రామకృష్ణారెడ్డి, కావ్యాశ్రీరాములు, వసంత్చౌహాన్, శ్రీకాంత్స్వామి, లావణ్యనరేశ్, నాయకులు నీలేష్ప్రసాద్ దూబే, జయరాజ్, బషీర్, రూపారెడ్డి, శ్రీకాంత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.