ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలువురు కాంగ్రెస్ కార్పొరేటర్లు శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ కార్పొరేటర్లు
ఖమ్మం, జనవరి 7: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరారు. 55, 17 డివిజన్ల కార్పొరేటర్లు మొతారపు శ్రావణి, దనాల రాధ, రఘునాథపాలెం మండలం బూడిదెంపాడు సర్పంచ్ షేక్ మీరాసాహెబ్ శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో వందమంది నాయకులు, కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్లో చేరారు. వారందరికీ మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై అన్ని పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ఏడేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మరెవరూ చేపట్టలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ జోడెద్దుల మాదిరిగా పరుగులెత్తిస్తున్నారని వివరించారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో కీలక నాయకులు ధనాల శ్రీకాంత్, మోతారపు సుధాకర్, వరదా నర్సింహారావు, గద్దల నర్సయ్య, సామినేని సురేశ్, నరేందర్, ముత్యం కొండలు సహా మరికొంత మంది ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కేఎంసీ మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, చిరుమామిళ్ల కిరణ్, పాలడుగు పాపారావు, వడ్డెల్లి లెనిన్చౌదరి తదితరులు పాల్గొన్నారు.