ఉస్మానియా యూనివర్సిటీ : నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి దంపతులు శుక్రవారం త్రిదండి చిన జీయర్ స్వామిని ఆయన ఆశ్రమంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆశ్రమంలో జీయర్స్వామి చేతుల మీదుగా పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి మాట్లాడుతూ పరమ పవిత్ర జీయర్ స్వామిని దర్శించు కోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన పెట్టిన ముహూర్తబలంతో యాదాద్రి పుణ్యక్షేత్రం భవ్యంగా రూపుదిద్దుకుంటోందని గుర్తు చేశారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని ఆయనను ప్రార్థించినట్లు చెప్పారు.