పోచమ్మమైదాన్: వరంగల్ నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాశాఖాధికారి డీ.వాసంతి సోమవారం తనిఖీ చేశారు. దేశాయిపేట, ఏనుమాములు, సర్దార్పేటలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె తరగతి గదులకు వెళ్ళి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కరోనా కాలంలో నష్టపోయిన సమయాన్ని ఉపయోగించుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని పేర్కొన్నారు.