ఎల్బీనగర్ : సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిన మహోన్నత పథకం దళితబంధు అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని దళితబంధు లబ్దిదారులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధుకు ఎంపికైన లబ్దిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పథకం ద్వారా తాము లబ్ది పొందడంతో పాటుగా మరో రెండు కుటుంబాలకు ఉపాధిని ఇవ్వాలన్నారు. దళితులను ఉన్నతంగా ఎదిగేలా చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అద్బుత పథకం దళితబంధని అన్నారు.
దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని అన్నారు. దళితుల్లో ప్రతిభావంతులు, నైపుణ్యం కలవారు ఉన్నా వారికి ఆర్థిక వనరులు లేక, చేయూత లేక వెనకబడి ఉంటున్నారని, సీఎం కేసీఆర్ అలాంటి వారికి దళితబంధు ద్వారా ఉపాధిని కల్పించి అండగా నిలుస్తున్నారన్నారు. ఈ పథకంలోని లబ్దిదారులు వ్యాపారాలు పెట్టుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు.
లబ్దిదారులచే ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే
దళితబంధు పథకానికి ఎంపికైన లబ్దిదారులతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు.
దళిత జాతి సమున్నత సాధికారత కోసం ఉన్నతమైన ప్రమాణాలు పెంపొందించడంలో భాగంగా సీఎం కేసీఆర్ సమున్నత ఆలోచనలతో రుపొందిన దళితబంధు పథకం ద్వారా లబ్దిదారులమైన మేము పథకాన్ని సద్వినియోగం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు.
పథకాన్ని ఏమాత్రం దుర్వినియోగం కాకుండా ముందుకు తీసుకుని వెళ్లడంతో పాటుగా ఈ పథకం ద్వారా ప్రారంభించే ఉపాధితో మరో రెండు కుంటుంబాలకు ఉపాదికి అవకాశం కల్పించి అణగారిన దళిత వర్గాల అభివృద్దికి శాయాశక్తులా కృషి చేస్తామని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబడ్కర్ సాక్షిగా ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్నాయకుడు చెరుకు ప్రశాంత్గౌడ్, మాజీ కార్పొరేటర్లు భవాని ప్రవీణ్కుమార్, జిట్టా రాజశేఖర్రెడ్డి, సామ తిరుమల్రెడ్డి, నల్ల రఘుమారెడ్డి, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.