కందుకూరు : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధుపథకం దళితులకు వరం లాంటిదని రంగారెడ్డి జిల్లా కందుకూర్ జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ దళిత బాంధవుడని కొనియాడారు. సోమవారం హుజురాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధుపథకానికి మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళిత బంధు కార్యక్రమం దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని తెలిపారు.
ఈ పథకాన్ని ప్రవేశపెడుతుంటే ప్రతి పక్షాల నాయకుల కడుపులు మండుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, నియోజకవర్గం నాయకులు సురుసాని సురేందర్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, వైఎస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, మాజీ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షు డు సురుసాని రాజశేఖర్రెడ్డి, మండల క్రిష్ణ, బాబు, చిర సాయిలు, పొట్టి ఆనంద్, పారిజాతం, క్రిష్ణరాం భూపాల్ రెడ్డి, బాలమల్లేష్, దేవేందర్, బర్కం వెంకటేష్, రాజు, తాళ్ల కార్తీక్, బొక్క దీక్షిత్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.